

హృదయాన్ని తాకుతాయి...
స్నేహ సౌరభాలను గుబాళింపజేస్తాయి...
ఎప్పటికీ మరపురాని అనుభూతిని కలుగజేస్తాయి...
ఎన్నేళ్లయినా తీయని జ్ఞాపకంగా మిగులుతాయి...
అటువంటి ఆత్మీయ పరిచయమే రత్నశేఖర్-పద్మ గార్ల పరిచయం..
వారు అమెరికా వచ్చి దాదాపు 20ఏళ్లయినా..
ఎక్కడా అమెరికన్ లైఫ్ స్టైల్ కనిపించకపోవడం ఆశ్చర్యం.. ఆనందం కలిగించింది.
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినాపొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీజాతి నిండు గౌరవము’ అన్న పద్యం గుర్తొచ్చిందంటే..వారి జీవన విధానం ఎంత ఆహ్లాదకరంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు మూలాలను కాపాడుకుంటూ...
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిస్తూ..
వారి పాపను కూడా అదే ఒరవడిలో పెంచుతూ..
శాస్త్రీయ సంగీతం వంటి తెలుగు కళలను నేర్పిస్తూ..తెలుగునాట ఉండి తెలుగు సంస్కృతిని, తెలుగు భాషను
విచ్ఛన్నం చేస్తున్న ఎంతోమందికి వీరు స్ఫూర్తిదాయకం.
రత్నశేఖర్-పద్మ దంపతుల ఆహ్వానం మేరకు
వారింటికి డిన్నర్ కు వెళ్లాం..
వారితో గడిపిన మూడుగంటలు మూడు నిమిషాల్లా గడిచిపోయాయి.
వారిచ్చిన ఆత్మీయ ఆతిథ్యం ఎప్పటికీ మరువలేనిది.
వారి ప్రేమ, ఆత్మీయతలను గుండెలనిండా పదిలపర్చుకుని
ఒకింత భారమైన హృదయంతో వెనుదిరిగాము.
ఆ దంపతులు మా పట్ల కనబరచిన ఆదరణను
మిత్రులందరితో పంచుకుంటూ...
వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
న్యూజెర్సీ నుంచి..
28-04-2016
No comments:
Post a Comment