మధ్యాహ్న సమయం... విజయవాడలోని స్వరాజ్యమైదాన్ వైపు
దారితీశాను. స్వరాజ్యమైదాన్ అనేకంటే సాహితీవనం అంటే
పంచుకోవడం మరింత ఉద్విగ్నతను కలిగించే అంశమే. శ్రీరమణ గారి గురించి చెప్పాలంటే.. తన సొంత ఊరంటే ఆయనకు చచ్చేంత మమకారం. ఆయన ఆ ఊరొదిలి వచ్చినా... ఆ ఊరు ఆయన్నొదల్లేదని, కలం పట్టుకోగానే వారి వీధి అరుగులు, గుడి, బడి వాటిలో కబుర్లాడుకునే పిల్లా పెద్దా కళ్లముందుకొస్తారని, అందుకే తన కథలు ఊరివాసన కొడతాయని తన కథల గురించి చాలా సాధారణంగా చెప్పుకునే గొప్ప రచయిత ఆయన. మిథునం ఒక జీవితం, బంగారు మురుగు ఒక సంప్రదాయం, ధనలక్ష్మి ఒక విజయగాథ అంటూ తన కథలపై ఉన్న మమకారాన్ని మన మనసుకు హత్తుకునేలా చెబుతారాయన. అందుకే ఇంత గొప్పగా ఎలా రాస్తారని రమణ గారిని అడిగాను. రెండు ముక్కల్లో ఆయన చెప్పిన సమాధానం.. ‘కాస్త పరిశీలన’, ఆ పరిశీలించిన దాన్ని ‘కాస్త అల్లగలగడం’ మినహా నేనూ మీలాంటి వాడ్నే అంటూ తేల్చేసారు. కానీ... పరిశీలించడం అందరూ చేస్తారు. మనసుకు హత్తుకునేలా అల్లడం మాత్రం శ్రీరమణ గారే చేస్తారు. అందుకే ఆయన కథల్లో అంతటి స్థానికత, సరళత వుంటాయి. ఇక గొల్లపూడి గారి గురించి చెప్పడమంటే చంద్రుడికో నూలు పోగు అన్నట్టే. నిన్నటి పుస్తక మహోత్సవంలో నన్నల్లుకున్న సాహితీ పరిమళాలను అనుభవించి అనుభూతిస్తున్నానంటే.... నమ్మాలి మరి.










No comments:
Post a Comment